Vijay Deverakonda : గిరిజన వ్యాఖ్యలపై విజయ్ దేవరకొండ క్షమాపణ.. కానీ ఆగని వివాదం:సినీ నటుడు విజయ్ దేవరకొండ గతంలో చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రస్తుతం ఆయనకు కొత్త చిక్కులు తెచ్చిపెట్టాయి. గిరిజనులను కించపరిచేలా మాట్లాడారన్న ఆరోపణలపై హైదరాబాద్లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదైంది.
విజయ్ దేవరకొండకు అట్రాసిటీ కేసు చిక్కులు: గిరిజనులపై వ్యాఖ్యల వివాదం
సినీ నటుడు విజయ్ దేవరకొండ గతంలో చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రస్తుతం ఆయనకు కొత్త చిక్కులు తెచ్చిపెట్టాయి. గిరిజనులను కించపరిచేలా మాట్లాడారన్న ఆరోపణలపై హైదరాబాద్లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదైంది. క్షమాపణలు చెప్పినప్పటికీ, ఈ వివాదం ఇంకా సద్దుమణగకపోవడం గమనార్హం.
గత ఏప్రిల్లో జరిగిన ‘రెట్రో’ సినిమా ప్రీ-రిలీజ్ వేడుకలో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ, పాకిస్థాన్ ఉగ్రవాదుల దాడుల గురించి ప్రస్తావించారు. ఈ సందర్భంగా, కొన్ని వేల సంవత్సరాల క్రితం ఆటవిక తెగలు (ట్రైబ్స్) ఎలా ఘర్షణ పడ్డాయో, ప్రస్తుత పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయనే అర్థం వచ్చేలా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు గిరిజన సమాజంలో తీవ్ర వ్యతిరేకతకు దారితీశాయి. తమను ఉగ్రవాదులతో పోల్చారంటూ పలు గిరిజన సంఘాలు అప్పట్లోనే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. విజయ్ వ్యాఖ్యలు తమ మనోభావాలను గాయపరిచాయని ఆరోపిస్తూ పోలీసులకు కూడా ఫిర్యాదులు అందాయి.
ఈ వివాదం ముదరడంతో, విజయ్ దేవరకొండ కొద్ది రోజుల క్రితం సోషల్ మీడియా ద్వారా స్పందించారు. “నా మాటల వల్ల కొన్ని వర్గాల మనోభావాలు దెబ్బతిన్నాయని తెలిసింది. నేను ఏ తెగను లేదా వర్గాన్ని కించపరచాలనే ఉద్దేశంతో మాట్లాడలేదు. భారతీయులంతా ఒక్కటేనని నమ్ముతాను. నేను ‘ట్రైబ్’ అనే పదాన్ని వేరే అర్థంలో ఉపయోగించాను, కానీ అది తప్పుగా అర్థం చేసుకున్నారు. నా వ్యాఖ్యల వల్ల ఎవరైనా బాధపడితే క్షమించండి. నేను శాంతి, ఐక్యత గురించే మాట్లాడాను” అంటూ ఆయన వివరణ ఇస్తూ క్షమాపణ కోరారు.
Read also:Jasprit Bumrah : బుమ్రా సరికొత్త రికార్డు: సెనా దేశాల్లో 150 వికెట్లు పడగొట్టిన తొలి ఆసియా బౌలర్
